Breaking News:  నిర్లక్ష్య డ్రైవింగ్‌.. యువతి మృతి.. జనసేన ఎంపీ కొడుకు పై కేసు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగరం మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ అత్యంత నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ యువతి మరణానికి కారణమయ్యాడు.

ఆగస్టు 16న జరిగిన ఈ ‘హిట్ అండ్ రన్’ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన మాదాపూర్ పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్నది జనసేన ఎంపీ కుమారుడేనని ఆధారాలతో సహా నిర్ధారించారు.

బాధితురాలి వివరాలు: మృతి చెందిన యువతిని భారతి ముఖి (26)గా గుర్తించారు. ఆమె స్థానిక లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్గర్ల్గా విధులు నిర్వహిస్తోంది.

రోడ్డు ప్రమాదం జరిగే తీరు: ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ ఎదురుగా భారతి ముఖి రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన లగ్జరీ కార్ ఆస్టన్ మార్టిన్ (TG-09-G-0666) ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల దర్యాప్తు & కేసు నమోదు: సీసీటీవీ ఫుటేజ్, కారు రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఘటనా సమయంలో కారును నడిపింది ఎంపీ కుమారుడు లింగమనేని సంజుష్ అని విచారణలో స్పష్టమైంది.

సంజుష్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం) కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు.

ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share
Share