తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదు: మంత్రి

కోదాడ, ఏపీబీ న్యూస్​: గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నష్టపోయిన కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ కు దక్కాల్సిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని వాటా కోసం సుప్రీం కోర్ట్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నది ట్రెబ్యూనల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని ఇరిగేషన్​ మినిస్టర్​ ఎన్​. ఉత్తమ్​ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆయన మాట్లాడారు. కృష్ణ నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణకు 34 % (299 టి ఎం సి(TMC) లు ), ఆంధ్రకు 66 % (512 టి ఎం సి (TMC)లు ) అంగీకారం చేసుకోవటం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు నష్టపోయాయని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కృష్ణ జలాలో 71 % తెలంగాణకు దక్కేలా పోరాడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో 17 లక్షల కోట్లతో బడ్జెట్లో నీటి పారుదల రంగానికి 1.83 లక్షల కోట్ల కేటాయించినప్పటికి కృష్ణ నది పై తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు, కొడంగల్, నారాయణపేట, డిండి, ఎస్ ఎల్ బి సి(SLBC) ప్రాజెక్ట్ లు పూర్తి చేయలేదని మేము అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్ లు వేగవంతం గా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే మూడేళ్లలో కృష్ణా నదిపై నిర్మాణం లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

minister uttam kumar reddy comments on water in kodad visit 1

కోదాడ నియోజకవర్గం లో నిర్మిస్తున్న రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వేగవంతంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై చెక్ డాం, పాలవరం లిఫ్ట్ ఇరిగేషన్ కు, నడిగూడెంలోని చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని, చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్ పై డబుల్ బ్రిడ్జ్, పాలే అన్నారంలో బ్రిడ్జ్ పనులు త్వరగా ప్రారంభించి ఎండాకాలం చివరి నాటికి  పూర్తి చేయాలని ఆదేశించారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ కొరకు రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని ఆర్డిఓ(RDO)ను ఆదేశించారు.

రూ.8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ & బి గెస్ట్ హౌస్ & డివిజన్ కార్యాలయం, రూ4  కోట్లతో నిర్మిస్తున్న కోర్టు బిల్డింగ్, రూ 5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ సి ఈ(CE) రమేష్ బాబు, ఎస్ ఈ(SE) లు నాగభూషణం, శివతేజ, ఆర్ అండ్ బి ఈ ఈ(R&B EE) సీతారామయ్య, ఆర్డీవోలు సూర్యనారాయణ, వేణుమాధవ్, తహసిల్దార్ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Share
Share