- ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు చేరాలి: డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి
- బ్యాంకు టర్నోవర్ రూ.4వేల కోట్లకు… ఏడాదిన్నరలో రూ.1324 కోట్లు పెరిగిన టర్నోవర్
- పంటరుణాలు, గోల్డ్లోన్స్ పరిమితి పెంచినం: మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇంచార్జి ఇలా త్రిపాఠి అన్నారు. డీసీసీబీ పాలకవర్గం రద్ధు అయిన తర్వాత పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ను ప్రభుత్వం నియమించిన అనంతరం తొలిసారిగా సోమవారం బ్యాంకు విజిట్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…పంట రుణాలు, బంగారు రుణాలను పెద్ద ఎత్తున ఇవ్వాలని డిపాజిట్లను భారీగా సేకరించి, బ్యాంకును ప్రగతి పథంలో నడిపించాలన్నారు. టర్నోవర్ మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు.
రూ.3,666 కోట్లకు బ్యాంకు టర్నోవర్…
డీసీసీబీ పాలకవర్గం ముగిసే నాటికి బ్యాంకు టర్నోవర్ రూ.3,666 కోట్లకు పెరిగిందని మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 15 నెలల్లో పెద్ద ఎత్తున టర్నోవర్ సాధించడం గర్వకారణమని చెప్పారు. గతేడాది జులైలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి బ్యాంకు టర్నోవర్ రూ2,342 కోట్లు ఉందని, ఏడాదిన్నర కాలంలో బ్యాంకు వృద్ధిని రూ.1324 కోట్లకు పెంచామని, దాంతో టర్నోవర్ రూ.4వేల కోట్లకు చేరిందని, బ్యాంకు లాభం రూ.60 కోట్లకు పెరిగిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా గతేడాది రూ.100 కోట్లు డిపాజిట్లు సేకరించామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.52 కోట్లు డిపాజిట్లు సేకరించామని తెలిపారు.
ప్రతి ఏడాది పంట రుణాల బడ్జెట్ కేవలం రూ.20,30 కోట్లు మాత్రమే ఉండేదని, కానీ తాను చైర్మన్ అయినప్పటికీ నుంచి పంట రుణాల పరిమితి రూ.100 కోట్లకు పెంచామని తెలిపారు. బంగారు రుణాలు గతంలో రూ.390 కోట్లు మాత్రమే ఉన్నాయని, ఈ ఏడాదిన్నర కాలంలో బంగారం ధరలు పెరగడంతో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రుణాలు రూ.1160 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో నల్లగొండ డీసీసీబీ రెండో స్థానంలో నిలిచిందని, నాబార్డ్ నుంచి బెస్ట్ ఫెర్మాంగ్ అవార్డు వచ్చిందని, ఐఎస్ఓ సర్టిఫికెట్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, నాస్కాబ్ నుంచి అసోసియేట్ మెంబర్షిప్, ప్రమోటింగ్ అచీవ్మెంట్ ప్రమోషన్ నుండి ఆలిండియా బెస్ట్ చైర్మన్ ఫెర్మాన్స్ అవార్డు పొందడం జరిగిందని మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.