10 ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటు

  • నల్లగొండలో 10 ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటు
  • మునుగోడులో కూడా ఇలాంటి టోర్నమెంట్​ నిర్వహిస్తాం
  • ప్రతీక్​ ఫౌండేషన్​, సుశీలమ్మ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులకు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: నల్లగొండ జిల్లా కేంద్రంలో క్రికెట్​, ఫుట్​బాల్​ లాంటి ఆటలు ఆడేందుకు పది ఎకరాల స్థలంలో నూతన హంగులతో స్టేడియం ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎన్​జీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రతీక్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జరిగిన ఎన్​పీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా ఎస్పీ శరత్​ చంద్రపవార్​తో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నూతన హంగులతో స్టేడియం ఏర్పాటు చేసుకుని సామర్ధ్యం కలిగిన క్రీడాకారులను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మునుగోడులో కూడా ఇలాంటి టోర్న మెంట్​ నిర్వహిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి ప్రతీక్​, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పేద క్రీ డాకారులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్​ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్​ రెడ్డి, వైస్​చైర్మన్ అబ్బగోని రమేష్​ గౌడ్​, కేసగాని వేణు గోపాల్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share
Share