హైదరాబాద్(APB News):
సబ్కా సాథ్, సబ్కా వికాస్ అంటే ఇదేనా? దళితుల హక్కులపై బీజేపీ అసలైన మజిలీ బయటపడింది! ..రేఖ బోయలపల్లి
మహారాష్ట్రలో దళిత సంక్షేమ నిధుల అంశంలో బీజేపీ ఎమ్మెల్యేలు మిగతా పార్టీలతో కాదు – ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిన ఘటనను గమనించి దేశ ప్రజలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
₹36 కోట్ల దళిత నిధుల విషయంలో జరిగిన ఈ ఘర్షణ, బీజేపీకి “దళిత సాధికారత” అనే మాటలు కేవలం ఓటు రాజకీయాల కోసం ఉపయోగించే పక్కా స్క్రిప్ట్ మాత్రమే అని నిరూపిస్తుంది. ఇదేనా బీజేపీ గొప్పగా చెప్పే “సబ్కా సాథ్, సబ్కా వికాస్”? అభివృద్ధి పేరుతో బడా కార్పొరేట్లకు వేల కోట్లు, కానీ దళితులకు వచ్చిన నిధుల పైనా కొట్టుకుంటే… అదే బీజేపీ అభివృద్ధి మోడల్..?
ఇలాంటి ఘోరంగా వ్యవహరించిన బీజేపీ ప్రజల మద్దతును ఇక ఆశించటం అర్హించదు. నిధులు ఎక్కడి అభివృద్ధికి, ఎవరి సంక్షేమానికి ఉపయోగపడాలి అనే స్పష్టత లేకుండా – ఆధిపత్య పోరుల కోసం వాడుకుంటే, దళితుల మీద చేసే హక్కుల చర్చలన్నీ కేవలం బాహ్య ప్రదర్శనగా మిగిలిపోతాయి. ప్రజలందరికీ ఓ స్పష్టం. ఈ సారి దళితులు ఓటుతోనే బీజేపీ కి సమాధానం చెబుతారు. నిజమైన వికాస్ మాటల్లో కాదు – చేతల్లో కనపడాలి.డా. రేఖ బోయలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు.