తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ కుల గణన చేసి అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడాని పట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక మాట ఇస్తే మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కుల గణన చేశారు, గతం లో జన గణన చేశారు కానీ కుల గణన కాలేదు కుల గణన ను శాస్త్రీయ పద్ధతులు చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. భారతదేశంలో డబ్బులు ఇంజన్ సర్కార్ అని చెబుతూ, దేశవ్యాప్తంగా డబ్బులు ఇంజన్ సర్కారు వస్తేనే బాగుపడుతుంది అంటున్నారు కానీ ఈరోజు మహారాష్ట్రలో చూస్తే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అభివృద్ధి వైపు చూడకుండా ఔరంగజేబు టుబ్ ను తీద్దామా క్రిమినల్ రైడ్స్ చేద్దామా అనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటిది ఈ డబ్బులు ఇంజన్ సర్కార్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితు బాగా లేనందువల్ల మా ముఖ్యమంత్రి గారు 30, 40 సార్లు కేంద్ర మంత్రులను కలవడానికి పోయాడు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి అని తెలంగాణ ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రంలో పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తూ క్రిమినల్ రైడ్స్ తీసుకొస్తున్నారు కానీ తెలంగాణలో పట్టుదలతో 42 శాతం రిజర్వేషన్ సాధించుకునే దిశగా అసెంబ్లీలో ఆమోదింపజేసారు. తెలంగాణలోని ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని అసెంబ్లీలో 42 శాతం ఆమోదం పొందిన ఈ బిల్లును పార్లమెంట్లో 2/3 వంతు ఆమోదింప చేయడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా బిసి రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏబిసిడి ప్లాన్లను కూడా అమలు చేయాలని కోరుతున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతూ వారిపై అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.