మీ కడుపులో మంటకి ENO వాడండి KTR..కాని చిల్లర వేషాలు వేయకండి: ఎంపీ చామల

మోత్కూరు(APB News):

యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లో R &B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావుస్ టూర్ గురించి BRS నాయకులు చేస్తున్న ఆరోపణల పై కౌంటర్ ఇచ్చారు.

  • భారత్ లో ఏ రాష్ట్రం తేని విదంగా మన తెలంగాణ కు అత్యధిక పెట్టుబడులు తెచ్చారు.
  • గత సీఎం కి దావుస్ తెల్వదు, సెక్రటరియేట్ తెల్వదు, ఫామ్ హౌస్ మాత్రమే తెలుసు
  • గత పాలకులు 9 సంవత్సరాల లో 25750 వేల కోట్లు తెచ్చారు.
  • సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే 178950 వేల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు.
  • సుమారుగా 50 వేల మందికి పైగా ఉపాధి పొందుతారు

BRS నాయకులు అత్యుత్సాహం,కడుపు మంట తో మేము చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు. రాష్టానికి 178950 వేల కోట్లు పెట్టుబడులు తెస్తే ఓర్వలేక మాట్లాడుతున్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలు చిన్న సన్నాకంపెనీ లు కాదు, వాళ్ళ లాగా పెట్టుబడుల కోసం వెళ్తున్న మంటూ గేట్ కాడ నలుగురుతో ఫోటోలు దిగి వచ్చినట్లు కాదు. KTR కి కుర్చీ మీదే ధ్యాస, ఆ కడుపు మంట తో ప్రజలని తప్పు తోవా పట్టిస్తుండు. కడుపు మండితే ENO తాగు KTR మీరు మీ కుటుంభ సభ్యులు. మీ అందరికి కోరియర్ పంపిస్తా చల్లగా తాగండి. మా ప్రభుత్వం చేసే కార్యక్రమం లో తప్పులు ఉంటే గుర్తు చేయండి. కాని మీ కుర్చీ మీద కోపం తో మీ విషాన్ని మా మీద చీమ్మొద్దు. తెలంగాణ ను గ్లోబల్ సిటీ చేస్తా అని చేపిన మీరు ఇప్పుడు ఈ విదంగా మాట్లాడడం ఏంటో మీకే తెలియాలి. మీ కడుపులో మంటకి ENO వాడండి KTR కాని
చిల్లర మల్లారా వేషాలు వేయకండి. ప్రజలకు వాస్తవాలు చెప్పండి… తప్పుతోవా పట్టించకండి…అంటూ కేటీఆర్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Share
Share