ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీది కాదు: బోయలపల్లి రేఖ

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బోయలపల్లి రేఖ ఘాటు రిప్లై….

ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీది కాదు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణని దోచుకున్న మీకు… గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఫార్మ్ హౌస్ కి పరిమితం చేసిన మీ బుద్ది మారట్లేదు..అధికారం కోల్పోయి మతిభ్రమించి అసలు బీ ఆర్ ఎస్ నాయకులు ఎం మాట్లతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు. ఎంపీ చామల పాపులర్ అవ్వటం కోసం కేటీఆర్ మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మా ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి రాజకీయ వారసత్వం లేకున్నా వారి స్వశక్తి తో విద్యార్థి దశ నుండి రాజకీయంలో అంచలంచలుగా ఎదిగి మొదటి ప్రయత్నంలోనే భువనగిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి జాతియ స్థాయి లో గుర్తింపు ఉన్న మా నాయకుడు ఎక్కడ..?? అయ్య పేరు చెప్పుకొని తెలంగాణ అమరవీరుల త్యాగం మీ త్యాగంగా చెప్పుకుంటూ మొదటి ఎన్నికల్లో 171 ఓట్లతో చావుతప్పి కన్నులోట్టబోయి గెలిచిన కేటీఆర్ ఎక్కడ..??

నిత్యం ప్రజాసేవలో ఉంటూ పార్టీకి విధేయుడు గా ఉంటూ అతి చిన్న వయసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. KTR మాత్రం అయ్య పేరు చెప్పుకొని లాటరీ లో పదవి తెచ్చుకున్నాడు. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసమో కేటీఆర్ ని విమర్శించవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి వారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకులుగా కొనసాగుతున్నారు ..

కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమిషన్ల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం అంటేనే దోచుకునే కుటుంబం. మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ కెసిఆర్ పాలనలో లాగా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీలో లేదు.. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అటు అధిష్టానానికి మరియు కార్యకర్తలకి ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసే నాయకుడు అయినా మా ఎంపీపై ఇష్టమొచ్చినట్లు ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తది అని బోయలపల్లి రేఖ హెచ్చరించారు.

Share
Share