- మందుబాబులకు న్యూఇయర్ కిక్కు
- డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్షాపులు
- బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు 1 గంట వరకు జీవో విడుదల చేసిన సర్కార్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అర్థరాత్రి 1 గంట వరకు అనుమతిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసింది. వేడుకు కు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లఘించకుండా ఈనెల 30,31 తేదీల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్సెమెంట్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నాయి.