- కార్పోరేషన్ ఎన్నికల్లో 45 స్థానాలు గెలవడమే టార్గెట్
- సర్వేలతోనే అభ్యర్థుల ఎంపిక, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి
- కొత్త సంవత్సరం కానుగా కార్పోరేషన్ ఇచ్చిన
- రిటర్న్ గిఫ్ట్గా కాంగ్రెస్ను గెలిపించాలి: మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 సీట్లు గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. 48 వార్డుల్లో మేయర్ పోటీ చేసే స్థానం, మరొక రెండు, మూడు వార్డులు మినహాయిస్తే 45 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరం కానుగా నల్లగొండను కార్పోరేషన్ చేశానని, దీని వెనక రెండు నెలల శ్రమ ఉందని, 14 మంది మంత్రులు, సీఎం రేవంత్రెడ్డి ఆమోదంతో అసెంబ్లీ, మండలిలో బిల్లు పాస్ చేయడం జరిగిందని చెప్పారు. కొత్త ఏడాది కానుకగా నల్లగొండ పట్టణ ప్రజలకు కార్పోరేషన్ బహుమతిగా ఇచ్చానని, మీరంతా నాకు రిటర్న్గిఫ్ట్గా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇవ్వాలని కోరారు.

వార్డుల్లో మంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు సర్వేలు చేస్తారని, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారని, ఆ మేరకు నిలబట్టే అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. నల్లగొండను రాష్ట్రంలో రోల్ మోడల్గా చేయాలన్నదే నా తపన. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను స్మా ర్ట్ సిటీగా చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే పట్టణం లో రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వ చ్చే రెండు,మూడేళ్లలో చేపట్టాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయ ని, క్లాక్టవర్ సెంటర్ను కూడా అద్బుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

రెండు వేల కోట్లతో అభివృద్ధి ..
పట్టణంలో రూ.272 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.53 కోట్లతో సీసీ రోడ్లు, రూ.109 కోట్లతో మౌలిక వసతులు, రూ.16 కోట్ల తో రోడ్ల అభివృద్ధి, రూ.4.50 కోట్లతో మోతికుంట, వల్లభారావు చెరువుల అభివృద్ధి, రూ.900కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు, రూ.9 కోట్లతో 3 సబ్ స్టేషన్లు, రూ.140 కోట్లతో లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు రోడ్డుమార్గం, అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం రూ.1.4 5 కోట్లతో 1100 లీటర్ల ట్యాంకు పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.