పల్లెల్లో కాంగ్రెస్​ జోష్​..989 చోట్ల హస్తం పార్టీ హవా…465 చోట్ల BRS

  • 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్​కు బీఆర్​ఎస్ గట్టి పోటీ …
  • మిగిలిన మూడు నియోజకవర్గాల్లో తిరుగులేని హస్తం​
  • కాంగ్రెస్​కు దీటుగా 61 నుంచి 30 స్థానాలు
  • 180 పంచాయతీల్లో సత్తా చాటిన రెబల్స్​, ఇండిపెండెంట్లు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: ఉమ్మడి జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్​ కేడర్​లో జోష్​ కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్ధతుదారులు సత్తా చాటారు.ప్రత్యర్ధి బీఆర్​ఎస్​ శ్రేణుల ఎత్తులకు చెక్​ పెట్టారు. ఎమ్మెల్యేలు పార్టీ మద్ధతు దారులను గెలిపించడంలో సర్వశక్తులు ఒడ్డారు. బీఆర్​ఎస్​ మాజీ లు గట్టిగా పనిచేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్​ మద్ధతుదారులు ఒంటిరిగానే ఫైట్​ చేశారు. బీఆర్​ఎస్​కు మాత్రం పరోక్షంగా కమ్యూనిస్టులు, బీజేపీ మద్ధతు తెలిపింది. రెబల్స్​కు, స్వంత్రులకు సైతం బీఆర్​ఎస్​ పరోక్షంగా సహరించింది. దాంతో ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో స్వంత్రులు, రెబల్స్​ సత్తా చాటారు. 9 నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ ప్రభావం చూపిన చోటే రెబల్స్​, ఇండిపెండెంట్లు గెలవడం గమనార్హం. 

12 నియోజకవర్గాల్లో 1820 పంచాయతీల్లో కాంగ్రెస్​ మద్ధతుదారులు 989 మంది గెలుపొందారు. బీఆర్​ఎస్​ 465 మంది గెలుపొందగా, స్వతంత్రులు, రెబల్స్​ 180 మంది గెలిచారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే నల్లగొండ, హుజూర్​నగర్​, కోదాడలో బీఆర్​ఎస్​ సత్తా చాటలేకపోయింది. దాంతోనే ఇక్కడ కాంగ్రెస్​ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. పంచాయతీల సంఖ్య అత్యధికంగా ఉన్న సెగ్మెం ట్లలో రెండు పార్టీల మధ్య పోటీ జరిగింది. రెబల్స్​ కూడా గట్టిపోటీ ఇ చ్చారు. దాంతో ఆలేరు, భువనగిరి, మునుగోడు, నాగార్జునసాగర్​, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్​లో బీఆర్​ఎస్​తో పాటు, రెబల్స్​ ప్రభావం చూపారు. ఈ స్థానాల్లోనే బీజేపీ, కమ్యూనిస్టులు సైతం బీఆర్​ఎస్​తో కలిసి పనిచేశారు.

జిల్లాపేరుజీపీలుకాంగ్రెస్బీఆర్ఎస్ఇతరులు
నల్లగొండ8864261
మునుగోడు161873721
నకిరేకల్126773110
మిర్యాలగూడ134723614
నాగార్జునసాగర్186843234
దేవరకొండ2691465425
సూర్యాపేట116643611
కోదాడ12058238
ఆలేరు1931116111
మొత్తం1820989465180

నోట్​: ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, రెబల్స్​తో కలిపి ఇతరులు.

Share
Share