తొలి పోరులో.. ఎమ్మెల్యేలకు ఎదురీత !..కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్ఎస్

  • ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, మునుగోడులో కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్ఎస్​
  • నల్లగొండ, నకిరేకల్​లో ఓటర్ల విలక్షణ తీర్పు
  • 28 మండలాల్లో ఎన్నికలు జరిగితే 17 మండలాల్లో సత్తా చాటిన బీఆర్​ఎస్​ సపోర్టర్స్​
  • మెజార్టీ స్థానాలు కాంగ్రెస్సే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల పైన గ్రామ స్థాయిలో ప్రతికూల ప్రభావం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​, డిసెంబర్​ 13

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరుగ్యారెంటీల పథకాల ప్రభావం పల్లెల్లో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక తొలి సారిగా జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్సే కైవసం చేసుకున్నప్పటికీ 2019లో బీఆర్​ఎస్​ సాధించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్​ఎస్​ 85 శాతం స్థానాలు క్లీన్​ స్వీప్​ చేసింది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక నివ్వెరపోయారు. మొత్తం 28 మండలాల్లో ఎన్నికలు జరిగితే 17 మండలాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. దాంతో ఆయా మండలాల్లో బీఆర్​ఎస్​ 50శాతం పంచాయతీలు గెలుచుకుంది. ప్రధానంగా ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు సెగ్మెంట్లలో కాంగ్రెస్​కు ఎదురుగాలి వీచింది.

తుంగతుర్తిలో వర్గపోరు..

తుంగతుర్తి, ఆలేరులో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీర్ల అయిలయ్య, మందుల సామేల్​కు గట్టిషాక్​ తగిలింది. ఎమ్మెల్యే వైఖరి నచ్చక కాంగ్రెస్​లో రెబల్స్​ పోటీచేశారు. ఒకేపార్టీలో రెండు వర్గాలు ఉండటం వల్ల బీఆర్​ఎస్​కు లబ్ధిచేకూరింది. తుంగతుర్తి నియోజక వర్గంలో మొత్తం 128 పంచాయతీల్లో కాంగ్రెస్​ మద్ధతుదారులు 76 చోట్ల గెలిస్తే, బీఆర్​ఎస్​ 40 పంచాయతీలు కైవసం చేసుకుంది. రెబల్స్​ 8 మంది గెలుపొందారు. అర్వపల్లి, నూతనకల్​, మద్దిరాల, శాలిగౌరారం మండలాల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులు సత్తా చాటారు. 

ఆలేరులో అయిలయ్య ఒంటరి…

ఆలేరులో ఎమ్మెల్యే అయిలయ్య ఒంటిరిగానే పోరాడాల్సి వచ్చింది. అభ్యర్థులను సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే సునీత భర్త గొంగడి మహేందర్​ రెడ్డి ఎత్తులను తిప్పికొట్టడంలో అభ్యర్థులు విఫలమయ్యారు. పోల్​ మేనేజ్మెంట్​, అభ్యర్థుల ఎంపికలో ముందునుంచీ మహేందర్​ రెడ్డి ఆచితూచి వ్యవహారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సునీత పైన కనిపించిన వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో లేకపోవడం గమనార్హం. స్థానికంగా బీఆర్​ఎస్​ కేడర్​ బలంగా ఉందని చెప్పేందుకు ఆలేరు ఫలితాలే నిదర్శనం. 153 పంచాయతీల్లో కాంగ్రెస్​ మద్ధతుదారులు 87 చోట్ల గెలిస్తే..బీఆర్​ఎస్​ సపోర్టర్స్ 50 చోట్ల గెలుపొందారు. రెబల్స్​ 10 మంది గెలుపొందడం గమనార్హం. ఆలేరు, రాజాపేట, బొమ్మల రామారాం, ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట మండలాల్లో కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్​ఎస్​ నిలిచింది.

మునుగోడులో రెబల్స్​ షాక్​…

మునుగోడు సెగ్మెంట్​లో ఐదు మండలాల్లో ఎన్నికలు జరిగితే నాంపల్లి, చండూరు మండలాల్లో కాంగ్రెస్​కు పోటీగా బీఆర్​ఎస్​ మద్ధతు దారులు సత్తాచాటారు. 104 పంచాయతీల్లో కాంగ్రెస్​ 56, బీఆర్​ఎస్​ 26 గెలిస్తే, రెబల్స్​ ఏకంగా 16 మంది గెలుపొందడం విశేషం. విచిత్రమేమంటే తొలిపోరులో ఎక్కువ మంది రెబల్స్​ గెలిచిన నియోజక వర్గం మనుగోడు కావడం విశేషం. 16 మంది రెబల్స్​ క్యాండేట్లు సర్పంచ్​లుగా గెలుపొందారు. మునుగోడు మండలంలో ఐదుగురు, మర్రిగూడలో నలుగురు, నాంపల్లిలో ముగ్గురు, చండూరులో ముగ్గురు రెబల్స్​ గెలిచారు. మేజర్​ గ్రామపంచాయతీ మునుగోడుతో సహా, చండూరు, నాంపల్లి మండలాల్లో బీఆర్​ఎస్​ గట్టిపోటీ ఇచ్చింది. నాంపల్లి మండలలో 32 పంచాయ తీల్లో 19 కాంగ్రెస్​, 9 బీఆర్​ఎస్​ గెలిస్తే, చండూరులో 19 పంచాయతీల్లో చెరో ఏడు పంచాయతీలు కైవసం చేసుకోవడం విశేషం.

సూర్యాపేటలో గట్టెక్కని కాంగ్రెస్​…

సూర్యాపేట నియోజకవర్గంలో తొలిపోరులో సూర్యాపేట రూరల్​, ఆత్మకూరు (ఎస్​)లో ఎన్నికలు జరిగాయి. 55 పంచాయతీలకుగాను కాంగ్రెస్​ 30, బీఆర్​ఎస్​ 20 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీజేపీ ఇద్దరు, రెబల్స్​ ఇద్దరు గెలుపొందారు. మాజీ మంత్రి దామన్నలే నిలేటు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వేణారెడ్డి, సర్వోత్తమ్​ రెడ్డిలు శ్రమించినప్పటికీ పల్లె ఓటర్లు మాత్రం బీఆర్​ఎస్​కు మొగ్గుచూపి నట్టు తెలుస్తోంది.

నల్లగొండలో ట్రిపుల్​ ఆర్(RRR)​ ఆపరేషన్​…

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్లగొండలో ట్రిపుల్​ ఆర్(RRR)​ ఆపరేషన్​ మిశ్రమ ఫలితాలు సాధించాయి. తిప్పర్తి ఇన్​ చార్జిగా పాశంరాంరెడ్డి, కనగల్​ బుర్రి శ్రీనివాస్​ రెడ్డి, నల్లగొండ మండలం గుమ్మల మోహన్​ రెడ్డి ఎన్నికల ఇన్​చార్జిలుగా రేయింబవళ్లు శ్రమించారు. పార్టీ తరపున అభ్యర్థులకు రూ.4కోట్లు సాయం అందించారు. అయినప్పటికీ నియోజకవర్గంలో 88 పంచాయతీల్లో కాంగ్రె స్​ 64 గెలిస్తే, బీఆర్​ఎస్​ 26 చోట్ల గెలిచింది. బీజేపీ, రెబల్స్​ ఇద్దరు గెలుపొందారు. నల్లగొండ రూరల్​లోనే పార్టీ తక్కువ స్థానాలు గెలుపొందింది. 31 పంచాయతీల్లో కాంగ్రెస్​ 19, బీఆర్​ఎస్​ 10 చోట్ల గెలి చింది. రూరల్​లో బీజేపీ, బీఆర్​ఎస్​, కమ్యూనిస్టుల పొత్తు వర్కవు ట్​ అయినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. తిప్పర్తిలో గతంలో బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వలసొచ్చిన అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో బీఆర్​ఎస్​ గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చింది. దాంతో 26 పంచాయతీల్లో కాంగ్రెస్​ 20, బీఆర్​ఎస్​ ఆరు చోట్ల గెలిచింది. కనగల్​ మండలంలో ఆరు చోట్ల బీఆర్​ఎస్​ గెలిస్తే, కాంగ్రెస్​ 25 మంది గెలుపొందారు. వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడవడంతో కాంగ్రెస్​ నష్టపోవాల్సి వచ్చింది.

నకిరేకల్​లో వర్గపోరు…

నకిరేకల్​ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కట్టంగూరు, గుండ్రాంపల్లి లాంటి గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఒక్కొక్కరు రూ.కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారు. ఇరువురి మద్ధతు లభించని వారు సైతం రెబల్స్​గా తలపడ్డారు. దీంతో నార్కట్​పల్లి, కట్టంగూరు, చిట్యాల మండలాల్లో కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలుపొందారు. 102 పంచాయతీల్లో కాంగ్రెస్​ 63, బీఆర్​ఎస్​ 24 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెబల్స్​ 8 మంది గెలవడం విశేషం. నార్కట్​పల్లి మండలంలో 17 కాంగ్రెస్​ గెలిస్తే, బీఆర్​ఎస్​ 7గురు గెలుపొందారు. ఈ మండలంలోనే రెబల్స్​ నాలుగు గ్రామాల్లో గెలుపొందారు. చిట్యాలలో 11 కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ 5, కట్టంగూరులో 12 కాంగ్రెస్​, ఐదు బీఆర్​ఎస్​ గెలిచింది. కట్టంగూరులో మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు పైచేయి సాధించారు.

ఆరు గ్యారెంటీల ఎఫెక్ట్​..

పంచాయతీ పోరులో ఆరు గ్యారెంటీల హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతోనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని అధికార పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెంచిన ఫించన్లు ఇవ్వకపోడం మైనస్​ పాయింట్​ కాగా. ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో అభివృద్ధి పైన దృష్టి పెట్టలేకపోయారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేపోయారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు.

సెగ్మెంట్​ వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు (ఫస్ట్​ఫేజ్​)

నియోజకవర్గంమొత్తం జీపీలుకాంగ్రెస్బీఆర్​ఎస్​
తుంగతుర్తి1287640
ఆలేరు1538750
సూర్యాపేట553020
నల్లగొండ886426
మునుగోడు1045626
brs mla jagadeesh reddy

మొదటి విడతలో 45 శాతం మంది బీఆర్​ఎస్​ మద్ధతుదారులు గెలుపొందారు. రాబోయే రోజులు అన్నీ బీఆర్​ఎస్​వే. ఎన్నిక ఏదైనా ఇక మీదట గెలిచేది బీఆర్​ఎస్సే. ప్రజల గుండల్లో కేసీఆర్​ గూడుకట్టుకుని ఉన్నారు. రేవంత్​ రెడ్డి పనితన జనాలకు అర్ధమైంది. కాంగ్రెస్​ వల్ల ఏమీకాదని ప్రజలకు తెలిసొచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్​ నాయకులు దారుణాలకు పాల్పడుతున్నారు. అధికార దుర్వినియోగం జరుగుతోంది. నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహారించడం లేదు. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి బీఆర్ఎస్ లీడర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఎన్నిక ఏదైనా ఇక మీద గెలిచేది బీఆర్​ఎస్సే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్​ రెడ్డి శనివారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేసారు.

Share
Share