- పోలీస్ శాఖ కఠినమైన ఆంక్షలు
- సాయంత్రం 6 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు
- వీడియోలు, ఫోటోల ఆధారంగా కేసులు
- డీజేలకు అనుమతి లేదు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పారు. డీజేలకు అనుమతి లేదని, ఓవర్ స్పీడ్తో రోడ్ల పైన వెహికిల్స్ నడపరాదని, మద్యం సేవించి రోడ్ల పైన తిరిగితే కేసులు పెడ్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫాం హౌజ్లు, గెస్ట్హౌజ్ల్లో ఈవెంట్స్కు పర్మిషన్ తీసుకోవాలని, విచ్చల విడిగా, పొరుగువారికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్ , రోడ్లపై గస్తీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధి లో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారని, ఈ సందర్భంగా ఫోటో గ్రాఫి, వీడియో గ్రాఫీలు తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.