- ఒక్క ఏడాదిలో లోక్ అదాలత్లో 65,522 కేసులు పరిష్కారం
- పిటీ కేసులు, ఎంవీ యాక్ట్, డ్రంకెన్ డ్రైవ్ కేసులన్నీ లోక్అదాలత్లోనే కొట్టివేత
- గతేడాదితో పోలిస్తే నల్లగొండ అధికం, సూర్యాపేటలో స్వల్పం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఒక్క ఏడాదిలో లోక్ అదాలత్లో 65,522 కేసులకు పరిష్కారం లభించింది. ప్రధానంగా మోటర్ వాహనాల చట్టం కింద నమోదైన కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు, పిటీ కేసులన్నీ లోక్ అదాలత్లోనే పరిష్కారమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు నల్లగొండ జిల్లాలో 49,943 కేసులు పరిష్కారం కాగా, సూర్యాపేట జిల్లాలో 15,579 కేసులు కొట్టేశారు. గతేడాదితో పోలిస్తే నల్లగొండ జిల్లాలో 31,686 కేసులు పెరిగితే, సూర్యాపేట జిల్లాలో 6,180 కేసులు తగ్గాయి. పలు కేసుల్లో నిందితులకు శిక్ష కూడా పడింది.
జిల్లాల వారీగా లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులు
| నల్లగొండ | 2024 | 2025 |
| యూఐ కేసులు | 84 | 254 |
| పీఐ కేసులు | 2,431 | 2,917 |
| పిటీ కేసులు | 9,296 | 29,143 |
| ఎంవీ యాక్ట్, డ్రంకెన్ డ్రైవ్ | 6,446 | 17,626 |
| మొత్తం | 18,257 | 49,943 |
| సూర్యాపేట | 2024 | 2025 |
| లోక్ అదాలత్ కేసులు | 2,379 | 2,439 |
| పీటీ కేసులు | 16,366 | 8,572 |
| డిస్పోజ్ చేసిన కేసులు | 3,014 | 4,568 |
| మొత్తం | 21,759 | 15,579 |