మహిళల పైన ఈ ఏడాది లైంగిక​ వేదింపులు, రేప్, మర్డర్, కిడ్నాప్ కేసులు ఎన్నంటే

  • మహిళల పైన వేదింపులు ఆగట్లే ! కఠినమైన శిక్షలు విధిస్తున్న ఆగని ఆగడాలు
  • ఈవ్టీజింగ్లకు గురివుతున్న యువతులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మహిళలు, యువతుల రక్షణ కోసం కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నప్పటికీ వేదింపులు మాత్రం ఆగడం లేదు. క్రైమ్ రికార్డ్స్ ప్రకారం మహిళల పైన వేదింపులు తగ్గినట్టు చూపిస్తున్నా..కేసుల తీవ్రత లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా మహిళలు, యువతుల పైన వివిధ రకాల వేదింపులు, రేప్లు, కిడ్నాప్లు పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం లేదు. పోలీసుల కన్నుగప్పి జరుగుతున్న ఇలాంటి కేసుల్లో మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 2024లో 679 మంది మహిళలు వేదింపులకు గురికాగా, ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు మహిళలను వేదించినందుకు గాను 684 మంది పైన కేసులు నమోదయ్యాయి. గతేడాది 185 రేప్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మహిళల పైన హత్యాచారం చేసినందుకుగాను 147 మంది పైన కేసులు పెట్టారు. 54 మంది మహిళలు గతేడాది కిడ్నాప్కాగా, ఈ ఏడాది 62 మంది కిడ్నాప్ అయ్యారు. లైంగింక వేదింపులు గేతడాది నల్లగొండ జిల్లాలో 216 మంది మహిళలు లైంగిక వేదింపుల కేసులు నమోదు కాగా,ఈ ఏడాది 196 కేసులు నమోదయ్యాయి. ఇక షీటీమ్స్ సూర్యాపేట జిల్లాలో పిటీ కేసులు ఈ ఏడాది 32, నల్లగొండ జిల్లాలో 160 కేసులు పెట్టారు. నల్లగొండ జిల్లాలో షీటీమ్స్కు వచ్చిన ఫిర్యాదు మేరకు రెడ్హ్యాండెండ్గా ఈ ఒక్క ఏడాదిలోనే 423 మందిని పట్టుకున్నారు. 5,751 హాట్స్పాట్స్లో విజిట్ చేశారు.

జిల్లాల వారీగా నమోదైన కేసులు…

నల్లగొండ జిల్లా:

కేసులు20242025
వేదింపులు313346
రేప్10187
కిడ్నాప్2627
లైంగిక వేదింపులు216196
షీటీమ్ పిటీ కేసులు78160
రెడ్హ్యాండెండ్78423

సూర్యాపేట జిల్లా:

కేసులు20242025
వేదింపులు366338
రేప్8460
కిడ్నాప్2835
లైంగిక వేదింపులు6738
షీటీమ్ పిటీ కేసులు9832
Share
Share