లిక్కర్​ మాఫియా: మేమింతే బాస్..అధికార జులంతో అక్రమ కేసులు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో లిక్కర్​ మాఫియా జూలు విదిల్చింది. 40 ఏళ్ల నుంచి లిక్కర్ మాఫియాను ఏలుతున్న బడాబాబుల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. లిక్కర్​ బిజినెస్​లో ఆరితేరిన విద్యా సాగర్​, ప్రసాద్​ మధ్య గత కొన్నేళ్ల నుంచి కోల్డ్​వార్​ నడుస్తోంది. గత ఇరవై ఏళ్ల నుంచి వ్యాపార భాగస్వాములైన వీళ్లద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో సాగర్​లో లిక్కర్​ బిజినెస్​ పైన ఆధిపత్యం చలాయించేందుకు ప్రసాద్​ వర్గం తన పైన బెదిరింపులకు పాల్పడుతోందని విద్యాసాగర్​ రెడ్డి సోమవారం హాలియా ఎక్సైజ్​ ఆఫీసు ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటానని నిర సన తెలిపారు.

Vidyasagar reddy protest

విద్యాసాగర్​ రెడ్డి తెలిపిన వివరాల మేరకు అధికార బలాన్ని అడ్డంపెట్టుకుని తన షాపులను లాక్కొన్నేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నాడని చెప్తున్నారు. తిరుమలగిరి(సాగర్), పెద్దవూర, నాగార్జునసాగర్​లో విద్యాసాగర్​ రెడ్డి, అతని పార్టనర్స్​ పేర్ల మీద నాలుగు షాపులు వచ్చాయి. ఎక్సైజ్​ ఆఫీసర్లు రూల్స్​ మేరకు మ్యాప్​లు, పర్మిట్​ రూమ్స్​ పరిశీలించిన అనంతరం షాపులు ఓపెన్​ చేసేందుకు పర్మిషన్స్​ ఇచ్చారు. కానీ ప్రసాద్​ అండ్​ కో సాగర్​ రెడ్డి షాపులను బెదిరించి లాక్కునేందుకు ఎక్సైజ్​ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాద్​ అండ్​ కో లిక్కర్​ బిజినెస్​లో ఎదురులేదనీ చెప్తుంటారు. అధికార పార్టీ నేతల అండదండలు కూడా ఉండటంతో టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులను ఏదోరకంగా మభ్యపెట్టి వాటిని తమ వశం చేసుకుంటారని విద్యాసాగర్​ రెడ్డి చెప్తున్నారు. స్వతహాగా ప్రభుత్వ టీచర్​ అయిన ప్రసాద్​తో సాగర్​ రెడ్డి కలిసి 20 ఏళ్ల పాటు లిక్కర్​ సిండికేట్​ నడిపించారు. కానీ ఆర్ధిక పరమైన అంశాల్లో విభేదాలు తలెత్తడంతో వేరుపడ్డారు. దాంతో గత నాలుగేళ్ల నుంచి సాగర్​ రెడ్డి షాపుల పైన ప్రసాద్​ కన్ను పడిందని, చెప్తున్నారు.

నాగార్జునసాగర్​లో కల్తీ మద్యం విచ్చలవిడిగా జరుగుతుందని, దీని వెనకాల పెద్దల హస్తం ఉందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇప్పుడు సాగర్​ రెడ్డి సొంతంగా బిజినెస్​ నడిపితే అక్రమ లిక్కర్​ మాఫియాకు అడ్డొస్తడనే కారణంతో అతనికి వచ్చిన షాపులను తమ చేతుల్లోకి తీసుకోవాలనే కుట్రపన్నుతున్నారని దాంతో షాపులకు పర్మిషన్​కు ఇచ్చిన రెండు, మూడు రోజుల్లోనే క్లోజ్​ చేయించారని తెలుస్తోంది. గతంలో తిరుమలగిరి వైన్స్​ వ్యవహారంలో ఇదేరకమైన ఇబ్బందులు గురిచేయడంతో ఎక్సైజ్​ సీఐ యమునాధర్​రావును ఏసీబీకి పట్టించారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది.

విద్యాసాగర్​ రెడ్డి అండ్​ కో కు పెద్దవూరలో ఒకటి, తిరుమలగిరిలో రెండు, నాగార్జునసాగర్​లో ఒక షాపు వచ్చింది. పెద్దవూరలో షాపు ఇప్పటి వరకు ఓపెన్​ చేయకుండా అడ్డుపడుతున్నారు. హిల్​కాలనీలో షాపు ఓపెన్​ చేసేందుకు నవంబర్​ 28 న పర్మిషన్​ ఇచ్చి, డిసెంబర్​ 1న షాపు సీజ్​ చేస్తున్నట్టు నోటీసు ఇచ్చారు. ఈ షాపుకు సమీపంలో మేరీమాత విగ్రహాం ఉందని, రోడ్డు పక్కనే షాపు ఏర్పాటు చేశారని మున్సిపల్​ అధికారులు ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం షాపు సీజ్​ చేశారు. దాంతో విద్యాసాగర్​ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని మళ్లీ షాపు ఓపెన్​ చేశారు. కానీ అందుకు ఆఫీసర్లు ససేమిరా ఒప్పుకోలేదు. నిజానికి ఈ షాపుకు ఎదురుగానే ప్రసాద్​ సిండికేట్ కు చెందిన బార్​ అండ్​ రెస్టారెంట్​ నడుస్తోంది. బార్​కు లేని అభ్యంతరం తన షాపుకు ఎందుకు వచ్చిందని సాగర్​ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.

ఇక పెద్దవూరలో ప్రధాన రహాదారికి ఆనుకుని షాపు ఏర్పాటు చేయోద్దని ఎక్సైజ్​ ఆఫీసర్లు అడ్డుచెప్పడంతో ఇప్పటికీ షాపు ఓపెన్​ చేయలేదు. అయితే రూల్స్​ ప్రకారం ప్రధాన రహాదారికి దూరంగానే షాపు ఏర్పాటు చేయడానికి పర్మిషన్​ తీసుకున్నారు. కానీ ఇదే ప్రాంతంలో ప్రసాద్​ అండ్​ కో షాపు పెట్టారు. ఈ షాపు రూల్స్​కు వ్యతిరేకంగా మెయిన్​ రోడ్డుకు అతిసమీపంలో ఉందని, దానికి లేని అడ్డంకులు తన షాపుకు ఏంటనీ సాగర్​ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక తిరుమలగిరి(సాగర్)​లో వైన్స్​ పెట్టుకునేందుకు ఇరిగేషన్​  ల్యాండ్స్ తప్పా ప్రైవేటు ల్యాండ్స్​ అందుబాటులో లేవు. ఇరిగేషన్​ ల్యాండ్​లో సాగర్​ రెడ్డి షాపు పెట్టొద్దని దాన్ని తొలగించాలని కంప్లైట్​ చేశారు. కానీ అదే ల్యాండ్స్​లో ప్రసాద్​ అండ్​ కో కొన్నేళ్ల నుంచి షాపులు నడిపిస్తోందని, తన పైన దౌర్జన్యం చేసి, షాపులను చేజిక్కించుకునేందుకు అధికార బలాన్ని అడ్డంపెట్టకుని కుట్ర చేస్తున్నారని విద్యాసాగర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Share
Share