కేసీఆర్​ అసెంబ్లీ రా..? మంత్రి కోమటిరెడ్డి సవాల్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: మాజీ సీఎం కేసీఆర్​ మాటకు కట్టుబడి నిజంగానే అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలెంజ్​ చేశారు. ఆదివారం వలిగొండ, నల్లగొండలో జరిగిన కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కొత్త సర్పంచ్​ల సన్మాన సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్​ పైన మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల నుంచి అసెంబ్లీకి వస్తానని మీడియాకు లీక్​లు ఇవ్వడం తప్పా ఆయన వచ్చేది లేదన్నారు. ఈసారి కూడా వస్తడనే నమ్మకం లేదని, ఒకవేళ కేసీఆర్​ అసెంబ్లీకి వస్తే ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కట్ట లేదని, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని కేసీఆర్​ అసెంబ్లీలో ఏమొఖం పెట్టుకుని వస్తాడని ప్రశ్నించారు. మల్లన్నసాగర్​, రంగసాయి సాగర్​ నుంచి వంద కోట్లు కేటాయిస్తే ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు నీళ్లు వచ్చేవని, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కోరిన్నప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు. 

komatireddy venkat reddy sarpanch meeting 3

నిన్నటి వరకు ఒక లెక్క…నేటి నుంచి మరో లెక్క అని అంటున్న కేసీఆర్​ ..ఆయన చెప్పే లెక్కలన్నీ బిడ్డ కవిత జిల్లాలు తిరుగూతు చెప్తోందని ఎద్దేవ చేశారు. కల్వకుర్తిలో బస్సు ఎక్కేందుకు చార్జీ పైసలు కూడా లేని నిరంజన్​ రెడ్డికి రెండు వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని కవిత నిలదీస్తోందని, నల్లగొండలో మాజీ మంత్రి జగదీష్​ రెడ్డి ఐదు వేలు, పది వేలు అడుక్కునే ఆయనకు మూడు వేల కోట్లు, శంషాబాద్​లో ఫాంహౌజ్​ ఎక్కడి నుండి వచ్చాయని కవిత లెక్కలు బయట పెడుతోందని, ఇక కేసీఆర్​ కొత్తగా చెప్పేలెక్కలు ఏంటనీ మంత్రి ప్రశ్నించారు. అధికారం ఉన్నప్పుడు కమీషన్ల పేరుతో దోచుకునేందుకు ప్రజాభవన్​ వచ్చిన ఆయన అధికారం కోల్పోయాక ఫాంహౌజ్​లో 24 నెలల నుంచి నిద్రపోయి ఇప్పుడు బయటకు వచ్చి కృష్ణా నీళ్ల పైన మీటింగ్​లు పెడ్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

komatireddy venkat reddy sarpanch meeting 4

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కృష్ణా నీళ్ల వాటా కోసం మూడు చోట్ల మీటింగ్​లు పెడ్తానని చెప్తున్న కేసీఆర్​..గత పదేళ్లలో కాలేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రాప్రాంతా కాంట్రాక్టర్లకు కట్టబెటి కమీషన్లు దోచుకున్నాడని, ఇక ఏపీ మాజీ సీఎం జగన్​తో దోస్తీ కట్టి, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని, రాయలసీమకు కృష్ణా నీళ్లు దోచిపెట్టండని, ఇప్పుడొచ్చి మీటింగ్​లు పెడ్తానంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి ధ్వజమెత్తారు.

komatireddy venkat reddy sarpanch meeting 2

నువ్వు చెప్పే లెక్కలు ఏందీ? కేసీఆర్​ పంపకాల లెక్క తప్పా నీ దగ్గర ఏ లెక్కలు లేవు? నువ్వు 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చిపోతే వాటిని తీర్చేందుకు సీఎం రేవంత్​ రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తుండని మంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయిండని ఎద్దేవ చేశారు. పార్లమెంట్​లో కాంగ్రెస్​కు ప్రతిపక్ష హోదా లేకున్నప్పటికి నేను, సీఎం రేవంత్​, ఉత్తమ్​ ముగ్గురం ఎంపీలు కలిసి పార్లమెంట్​లో బీజేపీని దుమ్మెత్తిపోశామని, అన్నారు. ప్రతిపక్ష నేత ఖర్గే రోజు పార్లమెంట్​ వచ్చి మోడీ ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించారని, కానీ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్​ గత 24 నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డికి ఎంత బాధ్యత ఉంటదో, ప్రతిపక్ష నేతగా కేసీఆర కు కూడా ప్రజల పట్ల అంతే బాధ్యత ఉంటదని, కానీ అసెంబ్లీకి వస్తానని మీడియాకు లీక్​లు ఇవ్వడం తప్పా, అసెంబ్లీకి వస్తడనే నమ్మకం ఇప్పటికీ లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Share
Share