మిర్యాలగూడ, ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ టౌన్ లో 27 వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్ రేబెల్లి లోహిత్ బీఆర్ఎస్ లో చేరారు. మిర్యాలగూడ టౌన్ లో రెడ్డికాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ‘27 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రేబెల్లి లోహిత్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తన అనుచరులు 200 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా మిర్యాలగూడ బీఆర్ఎస్ పట్టణ ముఖ్య నేతలు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టిలో చేరారు.
అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహిన పడిపోతుందని, రాబోయే భవ్యిషత్తు అంతా బీఆర్ఎస్ దే నని స్పష్టం చేశారు. కావున పార్టీ సంస్థాగత నిర్మాణానికి అందరూ కృషి చేయాలనీ దానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు చిహ్నం కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనాయని నిలదీయాలని సూచి౦చారు. ఏ ఒక్క హామీ అయిన పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా పూటకో మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధముగా మనకు ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ పడిన బాకిని కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచి వారు మన బాకీని వెంటనే అమలు చేసేలా డీమాండ్ చేయాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమములో పద్మశెట్టి కోటేశ్వర రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చీరంజీవి, ఎండి.షోయబ్,పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, నల్లగంతుల నాగభూషణం, యర్రమళ్ళ దినేష్, దోనేటి సైదులు, శ్రినాద్, వడ్డేపల్లి శ్రీనివాస్, బాచి,కూరపాటి సాంబశివ రావు, సిరసనగండ్ల ఈశ్వర్ చారి, మీసాల జగదీష్ నాంపల్లి యేసు, నరేష్ పార్టీలో చేరిన వారు స్వాతి, ప్రదీప్, కృష్ణ, సతీష్, నవీన్, గణేష్, కార్ల యల్లయ్య, శ్రీను, నాగయ్య, బంగారి తదితరులు ఉన్నారు.