నల్లగొండ జిల్లా కలెక్టర్​ గా బడుగు చంద్రశేఖర్​…ప్రస్తుత కలెక్టర్​ నిజామాబాద్ ​కు బదిలీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్​గా బడుగు చంద్రశేఖర్​ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా లోకల్​ బాడీస్​ అదనపు కలెక్టర్​గా పనిచేస్తున్న ఆయన్ని నల్లగొండ కలెక్టర్​గా ప్రభుత్వం నియమించింది. 2018 బ్యాచ్​కు చెందిన ఈయన గతంలో నిజామాబాద్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​గా పనిచేశారు. కాగా ప్రస్తుత కలెక్టర్​ ఇలా త్రిపాఠి నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​గా బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్​లో జిల్లాకు కలెక్టర్​గా వచ్చిన ఆమె 14 నెలల పాటు పనిచేశారు.

హెల్త్​, ఎడ్యుకేషన్​, వడ్ల కొనుగోళ్లు, ప్రకృతి వ్యవసాయ, మకానా పంట సాగు, ఆయిల్​ ఫాం సాగు, పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇందిరమ్మ ఇంటింటి సర్వే నిర్వహించడంలో రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో తొలిసారిగా మోకాళ్ల మార్పిడి చికిత్స ఆపరేషన్​ విజయవంతం చేయడం లో కలెక్టర్​ ప్రత్యేక శ్రద్ధ చూపారు. భవిత సెంటర్లు, మహిళలకు బాటరీలు వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు ఇలా త్రిపాఠి శ్రీకారం చుట్టారు.

Share
Share