మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం అంబెడ్కర్ చౌరస్థలో జరిగిన రైతు దీక్షలో ఆంక్షలు_లేకుండా రైతులందరికీ ఋణ మాఫీ చేయ్యాలని.రైతులకు మద్దతుగా ధర్నాకు కదం తొక్కిన బిఆర్ఎస్ శ్రేణులు..
రాష్ట్రంలో 40శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ కాలేదు అని సి.ఎం. రుణ మాఫీ పూర్తయిందని చెబుతుంటే మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని బిఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వమును హెచ్చరిస్తూ అందరికీ వెంటనే రుణ మాఫీ చేయ్యాలని అప్పటిదాక ప్రభుత్వంపై పోరాటం ఆగదని నినాదాలు చేశారు.బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయించి కేవలం 18వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కాబట్టి ధర్నా ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరారు.ధర్నా అనంతరం వినతి పత్రాన్ని ఎమ్మార్వో గారికి అందజేసిన బిఆర్ఎస్ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.




