నల్గొండ జిల్లా,శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన మారం వెంకటరెడ్డి,సాగర్ రెడ్డి గార్ల నానమ్మ మారం కమలమ్మ గారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు. శాలిగౌరారం లోని వారి స్వగృహంలో కమలమ్మ పార్థివదేహానికి పూలమాలతో నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.