- పిల్లి రామరాజుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రావు పరామర్శ
- పోలీస్ స్టేషన్లో కంప్లైట్ వాపసు తీసుకున్న మోహన్ రెడ్డి
- క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంఘాల ధర్నా
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీజేపీ సీనియర్ నేత పిల్లి రామరాజు యాదవ్ పైన జరిగిన దాడి దృష్ట్యా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శుక్రవారం ఆయన్ని ఫోన్లో పరామర్శించారు. ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దని, పెద్దగా చేయోద్దని, బీసీ సంఘాల ఆందోళన విరమింపచేయాలని కోరినట్టు తెలిసింది. అయితే అప్పటికే బీసీ సంఘాలు, విద్యార్ధి విభాగం నాయకులు క్లాక్ టవర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గురువారం పార్టీ ఆఫీసులో రామరాజు పైన దాడి చేసిన ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి టుటౌన్ పీఎస్లో కంప్లైట్ చేశారు. కేసు సంగతి ఆలస్యంగా బయటకు రావడంతో కోపోద్రుక్తులైన బీసీ సంఘాలు శుక్రవారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాడినికి సిద్ధ మయ్యారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు రామరాజు పైన పెట్టిన కేసును తిరిగి వాపసు తీసుకునేందుకు సీనియర్ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూధన్ రెడ్డిలు స్టేషన్ కు వెళ్లారు. స్టేట్ పార్టీ నుంచి పెద్దలు వచ్చి చర్చిస్తే తప్పా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రామరాజు స్పష్టం చేశారు.